Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 5వ తేదీ (రేపటి) నుండి 12వ తేదీ వరకు జరగనున్నట్లు మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగజ్నగర్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు. విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.ఈ పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్గా పాక శ్రీలత, డిపార్ట్మెంటల్ అధికారిగా తంగళ్లపల్లి రాకేష్ వ్యవహరిస్తారని ఎంఈఓ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎంఈఓ వాసాల ప్రభాకర్ విద్యార్థులకు సూచించారు
Admin
Vastava Gamyam