వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పేర్కొన్నారు. డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పోషణ్ అభియాన్ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి 38,130 స్మార్ట్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను టీజీటీఎస్ ద్వారా GeM పోర్టల్లో పారదర్శకంగా నిర్వహించారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం