Tuesday, 28 July 2026 12:57:07 PM
# కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం # 54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం. # జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి

Date : 25 July 2026 08:18 PM Views : 107

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నీట్ పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజనులు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలపై బలప్రయోగం, పోలీసు చర్యలను ఖండిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టిన ఆందోళనలను అణచివేయడం తగదన్నారు.నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించాలని, ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, యువజనులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఆందోళనల సందర్భంగా అతిగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పాలన సాగించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు "నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు జోహార్లు", "భారత రాజ్యాంగం వర్ధిల్లాలి", "పోరాడితే పోయేది బానిస సంకెళ్లు తప్ప మరొకటి కాదు" అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, కార్యదర్శులు ఏ. రాజేశం, రాజిరెడ్డి, జి. లక్ష్మణ్, నాయకులు శ్రీనివాస్, పోషన్న, బాపు, సత్యనారాయణ, బి. మల్లయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :