Saturday, 12 September 2026 03:55:43 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కార్మికుల ప్రధాన డిమాండ్లపై యాజమాన్యానికి వినతిపత్రం

Date : 05 September 2026 06:57 PM Views : 45

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : బెల్లంపల్లి ఏరియాలోని ఖైరగుడా ఓపెన్‌కాస్ట్‌ గనిలో కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో శనివారం ఖైరగుడా గని ఎస్‌ఓఎం అధికారికి వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి ఐ ఎన్ టి యు సి యూనియన్‌ ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ప్రస్తుతం అమలులో ఉన్న ప్లేడే విధానాన్ని గతంలో మాదిరిగా కార్మికులకు 7౦ శాతం ప్లేడేలు కల్పించాలని నాయకులు కోరారు. అలాగే ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఉద్యోగులకు ప్రతి సంవత్సరం నిర్వహించనున్న పీఎంఈ విధానాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల అవసరాలు, నిబంధనలకు అనుగుణంగా గతంలో అమలులో ఉన్న విధంగా మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఎంఈ నిర్వహించే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సీపీఎంఎఫ్‌ చిట్టీలను కార్మికులకు వెంటనే అందజేయాలని వినతిపత్రంలో కోరారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఐ ఎన్ టి యు సి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ ప్రకాష్‌ రావు,ఏరియా కార్యదర్శులు మాధవ్‌ కృష్ణ, బూర శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ పీఐటీ కార్యదర్శి గోమాస ప్రభాకర్‌తో పాటు వీరాస్వామి, వెంకటేష్‌ ఎం.పీ., వామన్‌, కుమారస్వామి, శివకుమార్‌, తిరుపతి, రాజశేఖర్‌, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: