Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కాగజ్నగర్: సరైన అనుమతులు లేకుండా ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత హెచ్చరించారు. గురువారం కాగజ్నగర్ మండలంలోని గన్నారం మాండవ, ఆరెగూడ, అనుకొడ గ్రామాల్లోని చెరువులను ఆమె సందర్శించి పరిశీలించారు.ఈ తనిఖీల్లో భాగంగా నజ్రుల్ నగర్ విలేజ్ నెం.12 పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను కలెక్టర్ పట్టుకున్నారు. వాటికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో, ఆ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.మట్టి లేదా ఇసుక రవాణా చేసేవారు ఖచ్చితంగా సంబంధిత శాఖల నుండి ముందస్తు అనుమతులు పొందాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ తహసీల్దార్ మధుకర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam