వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్రోపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా ప్రత్యేక కార్యవర్గ సమావేశం శనివారం జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పర్వతి రెడ్డి, జాక్టో కో-చైర్మన్ పర్వతి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ మాట్లాడుతూ, జూలై 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే త్వరలోనే పీఆర్సీ నివేదికను స్వీకరించి అమలు చేస్తారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వీలైనంత త్వరగా పూర్తిగా చెల్లిస్తారని రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ మాట్లాడుతూ, సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు రాష్ట్రోపాధ్యాయ సంఘం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు వెంటనే చేపట్టాలని, ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను ప్రభుత్వం. విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓడిగే కృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు వనమాల పద్మ, రాష్ట్ర కౌన్సిలర్ వి. కరుణాకర్, ఉపాధ్యక్షుడు చీపెళ్లి బాపు, మహిళా కార్యదర్శులు మహాలక్ష్మి, స్వప్న, మన్మోహన్, రాజ్కుమార్, సుమన్, విశ్వనాథ్, జయ, గంగుతాయి తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం