Tuesday, 28 July 2026 03:08:39 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పోరాటం కొనసాగుతుంది

బట్టారి వెంకటేశ్వర్లు

Date : 11 July 2026 07:18 PM Views : 39

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్రోపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా ప్రత్యేక కార్యవర్గ సమావేశం శనివారం జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పర్వతి రెడ్డి, జాక్టో కో-చైర్మన్ పర్వతి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ మాట్లాడుతూ, జూలై 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే త్వరలోనే పీఆర్సీ నివేదికను స్వీకరించి అమలు చేస్తారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వీలైనంత త్వరగా పూర్తిగా చెల్లిస్తారని రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ మాట్లాడుతూ, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు రాష్ట్రోపాధ్యాయ సంఘం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు వెంటనే చేపట్టాలని, ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను ప్రభుత్వం. విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓడిగే కృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు వనమాల పద్మ, రాష్ట్ర కౌన్సిలర్ వి. కరుణాకర్, ఉపాధ్యక్షుడు చీపెళ్లి బాపు, మహిళా కార్యదర్శులు మహాలక్ష్మి, స్వప్న, మన్మోహన్, రాజ్‌కుమార్, సుమన్, విశ్వనాథ్, జయ, గంగుతాయి తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :