వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఏఐటియుసి జిల్లా నాలుగో మహాసభలు ఈనెల 26వ తేదీన ఆసిఫాబాద్ మైనార్టీ ఫంక్షన్ హాల్లో జరుగుతాయని,జిల్లాలోని కార్మికులు,కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చాడు.ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో కమిటీ సమావేశం యూనియన్ ఉపాధ్యక్షులు జాడి లక్ష్మణ్ అధ్యక్షతన ఆసిఫాబాద్లోని ఎస్టియు భవన్లో జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసి, అపాయింట్మెంట్ డేట్ ను ప్రకటించి,ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు,గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులు వెంటనే ఆపాలని,రోజురోజుకీ ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అధికారులు వేధింపులు ఆపాకుంటే TGSRTC ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. CCS ఎన్నికలు నిర్వహించాలని,బ్రీత్ ఎనలైజర్ మిషన్ తో కార్మికులను ఇబ్బందులకు గురి చేయొద్దని,ప్యాసింజర్స్ గ్రీటింగ్స్ తో కార్మికుల మనోభావాలను దెబ్బతీయొద్దని అన్నారు.ఆర్టీసీ కార్మికులకు కనీస పెన్షన్ 25000/-చెల్లించాలని,DDల పేరుతో యాజమాన్యం కార్మికులను శ్రమదోపిడి గురి చేస్తుందని,లీవులు కూడా ఇవ్వడం లేదని ఆ పద్ధతి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో *ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు,ఎంప్లాయిస్ యూనియన్ సలహాదారుడు దివాకర్ గౌడ్,చైర్మన్ మల్లికార్జున్, డిపో సెక్రటరీ ఏల్పుల అశోక్ సహాయ కార్యదర్శి నరేష్,సునీల్,సుప్రీత్, S.తిరుపతి, రాజలింగ్, వెంకటేశు* తోపాటూ తదితరులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం