వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 98 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని తెలంగాణా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (టీఎస్టీడబ్ల్యూటీయూ) జిల్లా కార్యవర్గం బుధవారం డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి, పిఎంఆర్సి ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్లను శాలువాలతో సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల కృషికి సంఘం అభినందనలు తెలిపింది.జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ ఈ ఫలితాలు గిరిజన విద్యకు శుభసూచకమని, రాబోయే కాలంలో జిల్లా ఆశ్రమ పాఠశాలలను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Admin
వాస్తవ గమ్యం