వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యారంగానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తపస్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో మంచిర్యాల తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బండి రమేశ్ మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ నెల 14న జిల్లా కేంద్రంలో మహాధర్నా నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ స్పందన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం