Saturday, 13 June 2026 10:42:14 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బిల్‌ కలెక్టర్, బీట్‌ ఆఫీసర్‌

Date : 01 May 2026 06:06 PM Views : 28

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో అవినీతికి పాల్పడుతూ ఒక మున్సిపల్ బిల్ కలెక్టర్, ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ​ఒకరు సదాశివపేట ఆస్తి పన్ను తగ్గింపు కోసం.సదాశివపేట మున్సిపాలిటీలో బిల్‌ కలెక్టర్‌ నిఖిల్‌రెడ్డి ఒక ఇంటి యజమాని నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.బాధితుడికి రావాల్సిన రూ. 1.04 లక్షల ఇంటి పన్నును రూ. 35 వేలకు తగ్గిస్తానని నమ్మించి, అందుకు రూ. 35 వేలు డిమాండ్ చేశాడు. ఇప్పటికే రూ. 20 వేలు తీసుకున్న నిఖిల్‌రెడ్డి, గురువారం మిగిలిన రూ. 15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ​రెండోది భద్రాద్రి జిల్లా పోడు భూమి విషయంలో.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ బానోత్ నరేశ్‌ ఏసీబీకి చిక్కాడు. ఒక రైతు సాగు చేసుకుంటున్న పోడు భూమి జోలికి రాకుండా ఉండేందుకు నరేశ్ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు, లంచం తీసుకుంటున్న సమయంలో నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ​ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :