Tuesday, 28 July 2026 10:59:46 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బిల్‌ కలెక్టర్, బీట్‌ ఆఫీసర్‌

Date : 01 May 2026 06:06 PM Views : 60

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో అవినీతికి పాల్పడుతూ ఒక మున్సిపల్ బిల్ కలెక్టర్, ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ​ఒకరు సదాశివపేట ఆస్తి పన్ను తగ్గింపు కోసం.సదాశివపేట మున్సిపాలిటీలో బిల్‌ కలెక్టర్‌ నిఖిల్‌రెడ్డి ఒక ఇంటి యజమాని నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.బాధితుడికి రావాల్సిన రూ. 1.04 లక్షల ఇంటి పన్నును రూ. 35 వేలకు తగ్గిస్తానని నమ్మించి, అందుకు రూ. 35 వేలు డిమాండ్ చేశాడు. ఇప్పటికే రూ. 20 వేలు తీసుకున్న నిఖిల్‌రెడ్డి, గురువారం మిగిలిన రూ. 15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ​రెండోది భద్రాద్రి జిల్లా పోడు భూమి విషయంలో.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ బానోత్ నరేశ్‌ ఏసీబీకి చిక్కాడు. ఒక రైతు సాగు చేసుకుంటున్న పోడు భూమి జోలికి రాకుండా ఉండేందుకు నరేశ్ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు, లంచం తీసుకుంటున్న సమయంలో నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ​ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: