Thursday, 30 July 2026 02:14:52 AM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

​సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఎయిర్‌టెల్ టవర్ ఏర్పాటుపై నిరసన: కలెక్టర్‌కు ఫిర్యాదు

Date : 13 April 2026 07:59 PM Views : 189

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఎయిర్‌టెల్ కమ్యూనికేషన్ టవర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనను స్థానిక వాకర్స్ మరియు యోగా సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు సోమవారం నాడు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.మైదానంలో ప్రతిరోజూ వందలాది మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులు వాకింగ్ మరియు యోగా చేస్తుంటారు. పాఠశాల ఆవరణలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల వెలువడే రేడియేషన్ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ​ హైస్కూల్‌లో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే ఇక్కడే ఉన్న మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులు కూడా ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఉంటారు. చిన్న పిల్లల ఆరోగ్యంపై టవర్ ప్రభావం పడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.వందల సంఖ్యలో క్రీడాకారులు, స్థానికులు వినియోగించుకునే ఈ మైదానంలో టవర్ నిర్మించడం వల్ల ఆటలకు, వ్యాయామాలకు ఆటంకం కలుగుతుందని వినతి పత్రంలో పేర్కొన్నారు.వందలాది మంది ఆరోగ్యం మరియు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో కాకుండా టవర్‌ను వేరే చోటికి తరలించాలని వాకర్స్ & యోగా గ్రూప్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులను కోరారు. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడకుండా తక్షణమే స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :