వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని శివాజీ బిర్యానీ సెంటర్ లో శనివారం రాత్రి పెరుగు విషయంలో కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగిన విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.ఘటనలో భాగం గా నిందితులు అయిన పొన్నాల ప్రశాంత్,పొన్నాల కిషోర్ అనే వ్యక్తులు బిర్యానీ సెంటర్లో ఉన్న ఫిర్యాదు దారుడు అయిన మనుబోతుల ప్రశాంత్ అనే వ్యక్తిని హోటల్ యజమాని అనుకొని పెరుగు అడగగా,ఇరువురి మధ్య వాగ్వాదం. జరిగింది.అనంతరం నిందితులు ఫిర్యాదుదారుడిపై చేతులతో,వాటర్ బాటిళ్లతో దాడి చేసినట్లు విచారణలో తేలినది.ప్రశాంత్ ఫిర్యాదు మేరకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి,ఫిర్యాదులో పేర్కొన్న నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా/వార్తా కథనాల్లో బీర్ బాటిల్స్ తో దాడి చేసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ,అది వాస్తవం కాదు.దర్యాప్తులో లభించిన సమాచారం ప్రకారం, ఫిర్యాదుదారుడిపై ప్లాస్టిక్ తమ్సప్ బాటిళ్లు,చేతులతోనే దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది.ఈ ఘటనలో ఎవరికి గాయాలు అవలేదు,ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం వెళ్ళలేదు.అదేవిధంగా నిందితుల గత నేరచరిత్రను పరిశీలించి,చట్టపరమైన నిబంధనల ప్రకారం రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగిందని పోలీసులు.తెలియజేశారు. శ్రీరాంపూర్ పోలీస్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబడవని, ప్రజలు వాస్తవాలను నిర్ధారించుకోకుండా తప్పుడు సమాచారం లేదా అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయవద్దని పోలీసులు పేర్కొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం