వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల కేంద్రంగా అధికార, ప్రతిపక్ష పార్టీల్లో గ్రూప్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే పీఎస్ఆర్కు ముఖ్య అనుచరుడిగా ఉన్న జగన్మోహన్రావు ప్రత్యర్థి మంత్రి వివేక్ వర్గంలో చేరడం కాంగ్రెస్లో రాజకీయ కలకలం రేపుతోంది. మరోవైపు బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు వారసుడిగా విజిత్ రాజకీయంగా పావులు కదుపుతుండగా, మాజీ సినిమాటోగ్రఫీ ఛైర్మన్ రామ్మోహన్రావు రంగంలోకి దిగడం ఆ పార్టీలో ఆసక్తిని పెంచుతోంది. దీంతో మంచిర్యాల రాజకీయాల్లో గ్రూపుల పోరు మరింత ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
Reporter
వాస్తవ గమ్యం