Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : వెలగటూరు మండలం కోటిలింగాలలో నిర్వహించిన శ్రీ కోటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎంపీ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి,ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి దర్శనం చేసుకున్నారు.రాష్ట్రంలోని ప్రజల సుఖసంతోషాలు, శాంతి సమృద్ధి కలగాలని ఎంపీ ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam