వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ సర్కిల్ పరిధిలో విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు ఏబీ స్విచ్ల ఏర్పాటును వేగవంతం చేసినట్లు ఎస్ఈ ఉత్తమ్ జాడే తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో సింగిల్ ఫేజ్, త్రిఫేజ్ లైన్లకు ఏబీ స్విచ్లు ఏర్పాటు చేయడంతో ఫాల్ట్ వచ్చిన ప్రాంతంలో మాత్రమే విద్యుత్ నిలిపివేసి, మిగతా ప్రాంతాలకు నిరంతరాయ సరఫరా అందిస్తున్నామని చెప్పారు.ఈ సాంకేతికతతో ట్రిప్పింగ్ సమస్యలు తగ్గి, లోపాలను త్వరగా గుర్తించి మరమ్మతులు చేపట్టే అవకాశం ఏర్పడిందన్నారు. అత్యవసర విద్యుత్ సమస్యల కోసం వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం