Tuesday, 28 July 2026 03:08:34 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

మందమర్రిలో ఘనంగా సింగరేణి యాజమాన్యం–ఏఐటీయూసీ 19వ స్ట్రక్చర్ మీటింగ్

Date : 29 June 2026 06:03 PM Views : 157

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 29: సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ తో 19వ స్ట్రక్చర్ మీటింగ్ సోమవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సౌహార్ద వాతావరణంలో జరిగింది.సమావేశంలో ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, రామకృష్ణపూర్ కార్యదర్శి అక్బర్ అలీతో పాటు పలువురు నాయకులు పాల్గొని కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ, సింగరేణి అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మిక సంఘాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సంస్థ ఉత్పత్తితో పాటు ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. గత సమావేశంలో చర్చించిన అంశాల అమలుపై సమీక్ష నిర్వహించారు.అన్ని క్యాంటీన్లలో స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలి.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని టీ-టైప్ క్వార్టర్లకు నల్లటాప్ సీట్లు వేయాలి.గనులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను భర్తీ చేయాలి.జవహర్‌నగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలి.యూనియన్ ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందించి, అర్హత ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మికులు, కార్మిక సంఘాలు అందిస్తున్న సహకారాన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగించాలని కోరారు.ఈ సమావేశంలో ఎస్‌వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, కేకేఓసీ ప్రాజెక్ట్ అధికారి రాంబాబు, ఎస్‌కే గ్రూప్ ఏజెంట్ సంతోష్ కుమార్, డీజీఎంలు అశోక్, కిరణ్ కుమార్, సురేష్, షేక్ మదీనా భాష, డీవైపీఎం విజయ్ సందీప్, సీనియర్ పీఓ కార్తీక్‌తో పాటు ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కంది శ్రీనివాస్, సి.వి. రమణ మరియు ఇతర అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :