Saturday, 12 September 2026 05:46:59 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రిలో ఘనంగా సింగరేణి యాజమాన్యం–ఏఐటీయూసీ 19వ స్ట్రక్చర్ మీటింగ్

Date : 29 June 2026 06:03 PM Views : 191

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 29: సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ తో 19వ స్ట్రక్చర్ మీటింగ్ సోమవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సౌహార్ద వాతావరణంలో జరిగింది.సమావేశంలో ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, రామకృష్ణపూర్ కార్యదర్శి అక్బర్ అలీతో పాటు పలువురు నాయకులు పాల్గొని కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ, సింగరేణి అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మిక సంఘాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సంస్థ ఉత్పత్తితో పాటు ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. గత సమావేశంలో చర్చించిన అంశాల అమలుపై సమీక్ష నిర్వహించారు.అన్ని క్యాంటీన్లలో స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలి.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని టీ-టైప్ క్వార్టర్లకు నల్లటాప్ సీట్లు వేయాలి.గనులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను భర్తీ చేయాలి.జవహర్‌నగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలి.యూనియన్ ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందించి, అర్హత ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మికులు, కార్మిక సంఘాలు అందిస్తున్న సహకారాన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగించాలని కోరారు.ఈ సమావేశంలో ఎస్‌వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, కేకేఓసీ ప్రాజెక్ట్ అధికారి రాంబాబు, ఎస్‌కే గ్రూప్ ఏజెంట్ సంతోష్ కుమార్, డీజీఎంలు అశోక్, కిరణ్ కుమార్, సురేష్, షేక్ మదీనా భాష, డీవైపీఎం విజయ్ సందీప్, సీనియర్ పీఓ కార్తీక్‌తో పాటు ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కంది శ్రీనివాస్, సి.వి. రమణ మరియు ఇతర అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: