Sunday, 13 September 2026 07:53:16 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా చేసుకోవాలి

కలెక్టర్ కె.హరిత

Date : 17 June 2026 08:40 PM Views : 110

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ తపాలా శాఖలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని పాలన అధికారి ఛాంబర్‌లో బీమాదారుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు.బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామానికి చెందిన సీహెచ్. లక్ష్మి మరణించడంతో నామిని పెంటు బాయికి రెండు లక్షల రూపాయల చెక్కు అందించారు. అదే గ్రామానికి చెందిన కనక కమల రాయల్ సుందరం పథకంలో 565 రూపాయల ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్నారు. ఆమె పాముకాటుతో మరణించడంతో కుమారుడు కనక సుధాకర్‌కు 10 లక్షల రూపాయల బీమా చెక్కు అందించారు.తపాలా శాఖలో సంవత్సరానికి కేవలం 565 రూపాయల ప్రీమియంతో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పొందవచ్చు. 18 నుండి 65 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.కార్యక్రమంలో తపాలా శాఖ సీనియర్ మేనేజర్ కొట్టే శ్రీనివాస్, మేనేజర్ సాగర్, రాయల్ సుందరం కంపెనీ రీజనల్ మేనేజర్ ధన్ రాజ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :