వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ తపాలా శాఖలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని పాలన అధికారి ఛాంబర్లో బీమాదారుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు.బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామానికి చెందిన సీహెచ్. లక్ష్మి మరణించడంతో నామిని పెంటు బాయికి రెండు లక్షల రూపాయల చెక్కు అందించారు. అదే గ్రామానికి చెందిన కనక కమల రాయల్ సుందరం పథకంలో 565 రూపాయల ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్నారు. ఆమె పాముకాటుతో మరణించడంతో కుమారుడు కనక సుధాకర్కు 10 లక్షల రూపాయల బీమా చెక్కు అందించారు.తపాలా శాఖలో సంవత్సరానికి కేవలం 565 రూపాయల ప్రీమియంతో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పొందవచ్చు. 18 నుండి 65 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.కార్యక్రమంలో తపాలా శాఖ సీనియర్ మేనేజర్ కొట్టే శ్రీనివాస్, మేనేజర్ సాగర్, రాయల్ సుందరం కంపెనీ రీజనల్ మేనేజర్ ధన్ రాజ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం