వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా "అమ్మ పేరు మీద ఒక మొక్క" కార్యక్రమంలో మొక్కలు నాటారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామ పరిశుభ్రత, వర్షాకాల సన్నద్ధత, దోమల నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు పంటల మార్పిడి, ఆధునిక సాగు పద్ధతులను అనుసరించాలని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం