వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తాడిచెర్ల బ్లాక్-2 గని సింగరేణి సంస్థకు తలమానికమని రాష్ట్ర గనుల శాఖ మంత్రి డాక్టర్ జి.వి. వెంకటస్వామి అన్నారు. సోమవారం మందమర్రిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ గనిలో 430 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, సుమారు 40 ఏళ్ల పాటు ఉత్పత్తి కొనసాగుతుందని తెలిపారు.ఈ గని ద్వారా 3 వేల శాశ్వత ఉద్యోగాలు, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని బలహీనపరిచే ప్రయత్నాలు చేసిందని ఆరోపించిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇంకా మిగిలిన గనులను కూడా సింగరేణికే కేటాయించేలా కేంద్రాన్ని కోరతామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం