Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన ఆశా వర్కర్ నాయిని శకుంతల మృతి చెందడం విషాదకరమని సీఐటీయూ జిల్లా జాయింట్ సెక్రటరీ వెలిశాల క్రిష్ణమాచారి అన్నారు. చింతకుంట సబ్సెంటర్లో విధులు నిర్వహిస్తున్న శకుంతల అధిక పనిభారం,ఎండ తీవ్రత కారణంగా మృతి చెందినట్లు ఆరోపించారు.మృతురాలి భౌతికకాయానికి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా అధిక పనిభారం మోపుతున్న ప్రభుత్వ విధానాలను విమర్శించారు.మృతురాలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పద్మ, నాయకులు సరస్వతి, కేసరా, కవిత, శాంత నిర్మల తదితరులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam