వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి ఇల్లందు క్లబ్లో శుక్రవారం బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల 24వ త్రైపాక్షిక భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గనుల్లో భద్రతా చర్యల విషయంలో యాజమాన్యం ఎలాంటి రాజీ పడదని తెలిపారు.డీఎంఎస్ (మైనింగ్) సాగేష్ కుమార్ ప్రతి ఉద్యోగి రక్షణ సూత్రాలు పాటిస్తూ ప్రమాదాలను సున్నాకు చేర్చేలా కృషి చేయాలని సూచించారు. కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు సింగరేణి వ్యాప్తంగా భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు గనుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించగా, అధికారులుసానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో డీజీఎంఎస్ అధికారులు, ఏరియా జీఎంలు, సేఫ్టీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం