వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శనివారం స్వర్ణకారుల సమస్యల పరిష్కారం కోసం మందమర్రి ఎమ్మార్వోను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా స్వర్ణకారులు తమ వృత్తికి సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కటుకోజ్వల వేణు, ప్రధాన కార్యదర్శి ముత్తోజు రాజు, సంఘ సభ్యులు కందుకూరి రమణాచారి, కొండపర్తి రమేష్, బోనాల శ్రీనివాస్, గజ్జెల సతీష్తో పాటు పలువురు స్వర్ణకారులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం