Friday, 11 September 2026 02:49:38 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యపై ట్రస్మా ఆగ్రహం.

నేడు మందమర్రిలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ

Date : 20 August 2026 02:39 PM Views : 105

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నల్గొండ జిల్లాలో నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటనపై మందమర్రి మండల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులపై విద్యార్థులు దాడులకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొంది.ఘటనను నిరసిస్తూ గురువారం సాయంత్రం 6 గంటలకు మందమర్రి మార్కెట్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు ట్రస్మా నాయకులు తెలిపారు. రాష్ట్ర, జిల్లా సంఘాల పిలుపు మేరకు శుక్రవారం చేపట్టే పాఠశాలల బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ట్రస్మా మండల అధ్యక్షుడు పెద్దపెల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ డ్రగ్స్ సంస్కృతి, చిన్నారులకు అందుబాటులోకి వస్తున్న సెల్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, హింసాత్మక కంటెంట్ విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మండల గౌరవాధ్యక్షుడు పోల్ శ్రీనివాస్ మాట్లాడుతూ రూపారెడ్డి హత్య ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. పాఠశాలల్లో క్రమశిక్షణ అమలు చేసే విషయంలో ఉపాధ్యాయులకు తగిన రక్షణ, స్వేచ్ఛ కల్పించాలని కోరారు. రూపారెడ్డి హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుని చట్టప్రకారం శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులు,పాఠశాలల. యాజమాన్యాలు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ట్రస్మా నాయకులు పిలుపునిచ్చారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: