Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగిలో పండించిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కలెక్టర్ హరిత రైతులకు విజ్ఞప్తి చేశారు.శుక్రవారం కౌటాల మండల కేంద్రంలోని వ్యవసాయ గిడ్డంగిలో మార్క్ఫెడ్, గురుడుపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, సాండ్గాం గ్రామంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు, అదనపు కలెక్టర్ ఎం.డెవిడ్లతో కలిసి కలెక్టర్ హరిత ప్రారంభించారు.దళారులకు అమ్మకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని ఎమ్మెల్సీ దండె విఠల్ రైతులను కోరారు. సన్న రకం వరి ధాన్యానికి క్వింటాల్కు ₹500 బోనస్ అందిస్తారని కలెక్టర్ తెలిపారు.కాగజనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుద్దాల దేవయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam