Sunday, 13 September 2026 07:38:09 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య సంఘం డిమాండ్

Date : 24 June 2026 07:39 PM Views : 264

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 24: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు కోల్ ఇండియా హైపవర్ కమిటీ వేతనాలు, ఏరియర్స్‌తో సహా చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య సంఘం డిమాండ్ చేసింది.ఈ మేరకు బుధవారం మందమర్రి సివిక్ అడ్డా వద్ద సంఘం గౌరవాధ్యక్షుడు సంకె రవి, బెల్లంపల్లి రీజినల్ కార్యదర్శి దూలం శ్రీనివాస్ కాంట్రాక్ట్ కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీలు ఇచ్చాయని, కానీ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.కనీసం కోల్ ఇండియాలో ఒప్పందం ప్రకారం అమలు చేయాల్సిన హైపవర్ కమిటీ వేతనాలను కూడా అమలు చేయడం లేదని, పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో పర్మనెంట్ కార్మికులు మిగులుగా ఉన్నారనే కారణంతో భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నాలు. జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయడం, పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హైపవర్ కమిటీ బకాయిలను చెల్లించడం కోసం చేపట్టే పోరాటాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మందమర్రి డివిజన్ సహాయ కార్యదర్శి బచ్చలి సురేందర్‌తో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :