వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రిలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఆవుల సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మందమర్రి మార్కెట్లోని అయ్యప్ప టెంపుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సింగరేణి మనోవికాస్ పాఠశాలలో విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ముఖ్య నాయకులు పిట్టల సుధాకర్, వాసాల అజయ్, ఆవుల శ్రవణ్, అర్చనపెల్లి చరణ్, శ్రీనివాస్, రాకేష్, బాబీ, వెంకటేష్ రావు, సంజీవ్తో పాటు జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం