వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాణి: మండలంలోని మంగీ, పంగిడి మధోర గ్రామపంచాయతీల పరిధిలో బీఎస్ఎన్ఎల్ ,జియో, ఎయిర్టెల్ టవర్ల ద్వారా మెరుగైన మొబైల్ నెట్వర్క్ సౌకర్యం కల్పించాలని కోరుతూ తిర్యాణి సర్పంచ్ యూనియన్ మండల అధ్యక్షుడు తుమ్రం గోపాల్ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తుమ్రం గోపాల్ మాట్లాడుతూ.ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు సర్వే ప్రక్రియలో మారుమూల గ్రామాల్లో మొబైల్ నెట్వర్క్ లేకపోవడంతో బీఎల్ఓలు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, డేటాను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగార్థులు, ప్రజలు కూడా నిత్యావసర ఆన్లైన్ సేవలను వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల మంగీ, పంగిడి మధోర ప్రాంతాల్లో వెంటనే మొబైల్ నెట్వర్క్ సమస్యను పరిష్కరించేలా సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం