వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో కోరమాండల్ సంస్థకు చెందిన 'మన గ్రోమోర్' వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి బి వెంకట్ సీఐ రమేష్ స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్ చేతుల మీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రోమోర్ అధికారులు మాట్లాడుతూ. తమ కేంద్రం ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, సాంకేతిక సలహాలతో సహా వ్యవసాయానికి అవసరమైన అన్ని సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కేంద్రం వల్ల పంట దిగుబడిని పెంచుకునేందుకు రైతులకు సహాయం లభిస్తుందివ్యవసాయ రంగానికి మరింత సాంకేతిక సహకారాన్ని, నాణ్యమైన సేవలను అందించే లక్ష్యంతో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న 'మన గ్రోమోర్' వ్యాపార కేంద్రం కొమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో ఈ నూతన కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ భానుప్రకాశ్.మార్కెటింగ్ మేనేజర్ దేవరాజ్ కనక శ్రీనివాస్ (ఎఫ్ఏస్ఎ) సందీప్ సంతోష్ రైతులు తదితరులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం