Saturday, 13 June 2026 10:43:24 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

ఖానాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై సమగ్ర విచారణ జరపాలి,జిల్లా కలెక్టర్‌కు న్యూ డెమోక్రసీ వినతి

Date : 11 May 2026 06:35 PM Views : 646

Vastava Gamyam - తెలంగాణ / నిర్మల్ : ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీమ్ చౌరస్తా సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే విచారణ పూర్తి చేయాలని, అనర్హులను తొలగించి అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలని సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ మరియు డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా అధికారులకు రాతపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల కేటాయింపులు జరిపారని ఆరోపించారు.పేదలకు చెందాల్సిన ఇళ్లను బడా బాబులకు, ఇతర అనర్హులకు కేటాయించి అన్యాయం చేశారని మండిపడ్డారు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, లబ్ధిదారుల నుండి 'సెల్ఫ్ అఫిడవిట్' తీసుకోవాలని, తద్వారా అక్రమంగా ఇళ్లు పొందిన వారిని తొలగించి నిజమైన పేదలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లు వారికే దక్కాలి. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది అధికారులు న్యాయం చేయాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం."ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ కన్వీనర్ తోట రాధా, లక్ష్మి, కల్పన, కమల, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :