Wednesday, 29 July 2026 05:45:55 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

ఖానాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై సమగ్ర విచారణ జరపాలి,జిల్లా కలెక్టర్‌కు న్యూ డెమోక్రసీ వినతి

Date : 11 May 2026 06:35 PM Views : 688

వాస్తవ గమ్యం / తెలంగాణ / నిర్మల్ : ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీమ్ చౌరస్తా సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే విచారణ పూర్తి చేయాలని, అనర్హులను తొలగించి అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలని సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ మరియు డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా అధికారులకు రాతపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల కేటాయింపులు జరిపారని ఆరోపించారు.పేదలకు చెందాల్సిన ఇళ్లను బడా బాబులకు, ఇతర అనర్హులకు కేటాయించి అన్యాయం చేశారని మండిపడ్డారు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, లబ్ధిదారుల నుండి 'సెల్ఫ్ అఫిడవిట్' తీసుకోవాలని, తద్వారా అక్రమంగా ఇళ్లు పొందిన వారిని తొలగించి నిజమైన పేదలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లు వారికే దక్కాలి. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది అధికారులు న్యాయం చేయాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం."ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ కన్వీనర్ తోట రాధా, లక్ష్మి, కల్పన, కమల, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :