Vastava Gamyam - తెలంగాణ / నిర్మల్ : ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీమ్ చౌరస్తా సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే విచారణ పూర్తి చేయాలని, అనర్హులను తొలగించి అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలని సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ మరియు డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా అధికారులకు రాతపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల కేటాయింపులు జరిపారని ఆరోపించారు.పేదలకు చెందాల్సిన ఇళ్లను బడా బాబులకు, ఇతర అనర్హులకు కేటాయించి అన్యాయం చేశారని మండిపడ్డారు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, లబ్ధిదారుల నుండి 'సెల్ఫ్ అఫిడవిట్' తీసుకోవాలని, తద్వారా అక్రమంగా ఇళ్లు పొందిన వారిని తొలగించి నిజమైన పేదలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లు వారికే దక్కాలి. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది అధికారులు న్యాయం చేయాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం."ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ కన్వీనర్ తోట రాధా, లక్ష్మి, కల్పన, కమల, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam