Friday, 11 September 2026 02:46:46 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి:

నడిపెల్లి విజిత్ కుమార్

Date : 17 August 2026 02:43 PM Views : 62

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను పక్కనపెట్టి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను నిలిపివేసే ప్రయత్నాలను ప్రభుత్వం ,విరమించుకోవాలని డిమాండ్ చేశారు.కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 9న కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన పిటిషన్‌పై ప్రభుత్వం అప్పీల్ చేయాలని, అలా చేయని పక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ నిరసన స్థలానికి చేరుకుని బీఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడారు. మంచిర్యాలలో జరుగుతున్న నిరసనల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు, బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :