Tuesday, 28 July 2026 12:58:28 PM
# కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం # 54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం. # జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

చింతల మాదార జలపాతానికి పోటెత్తిన పర్యాటకులు..!

వర్షాలతో ఉప్పొంగిన జలధారలు.. ప్రకృతి అందాలకు ముగ్ధులవుతున్న సందర్శకులు

Date : 21 July 2026 05:20 PM Views : 168

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చింతల మాదార జలపాతం కురుస్తున్న వర్షాలతో సరికొత్త అందాలను సంతరించుకుంది. ప్రకృతి ఒడిలో నుంచి వెండి తెరలా జారిపడుతున్న జలధారలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు తెలంగాణలోని పలు గ్రామాలు, సమీప జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చింతల మాదార జలపాతం వద్ద సందర్శకుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.అయితే వర్షాల కారణంగా రాళ్లు జారుడుగా మారే అవకాశం ఉండటంతో ప్రమాదాలను నివారించేందుకు స్థానిక కమిటీ అప్రమత్తమైంది. సందర్శకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని కమిటీ నిర్ణయించింది. పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండి భద్రతా సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :