వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చింతల మాదార జలపాతం కురుస్తున్న వర్షాలతో సరికొత్త అందాలను సంతరించుకుంది. ప్రకృతి ఒడిలో నుంచి వెండి తెరలా జారిపడుతున్న జలధారలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు తెలంగాణలోని పలు గ్రామాలు, సమీప జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చింతల మాదార జలపాతం వద్ద సందర్శకుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.అయితే వర్షాల కారణంగా రాళ్లు జారుడుగా మారే అవకాశం ఉండటంతో ప్రమాదాలను నివారించేందుకు స్థానిక కమిటీ అప్రమత్తమైంది. సందర్శకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని కమిటీ నిర్ణయించింది. పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండి భద్రతా సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు
Reporter
వాస్తవ గమ్యం