వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కోటపల్లిల:- రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని,అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చెన్నూర్ రూరల్ సీఐ ఆర్.కృష్ణ అన్నారు.ప్రభుత్వంనిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ వారోత్సవలలో భాగంగా పారుపల్లి,రాంపూర్ గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేశారు.క్షణికావేశంలో అతివేగంతో,నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని సీఐ హెచ్చరించారు.వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.గ్రామలలో మైనర్లు వాహనాలు నడపకుండా చూడటం మరియు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యం.ప్రమాద రహిత సమాజం కోసం గ్రామస్తులందరితో కలిసి పోలీసులు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, ఎంపిడిఓ నాగేశ్వర్ రావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం