వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో రైతులు అధిక దిగుబడి సాధించేందుకు శాస్త్రీయ మెలకువలు పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం నస్పూర్ కలెక్టరేట్లో వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వం సన్నరకం వడ్లకు బోనస్ అందిస్తున్నందున, వచ్చే వానాకాలం సీజన్లో రైతులు వీటిని సాగు చేసేలా అధికారులు ప్రోత్సహించాలి. జిల్లాలో సుమారు 1.57 లక్షల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసినట్లు తెలిపారు.నిబంధనల ప్రకారం ధాన్యం తెచ్చే రైతులకు మద్దతు ధరతో పాటు ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేస్తామని, కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు,సాగు సూచనలు అందిస్తూ వారు ఆర్థికంగా లబ్ధి పొందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Admin
వాస్తవ గమ్యం