వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్, జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో న్యూఢిల్లీ నుండి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ముఖ్య అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆసిఫాబాద్ రెవెన్యూ మండల అధికారి లోకేశ్వర్ రావుతో పాటు కలెక్టర్ హాజరయ్యారు.బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లను నియమించి శిక్షణ అందించాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సవరణ ప్రాముఖ్యతను వివరించాలని కలెక్టర్ సూచించారు. నెలాఖరులోగా ఓటరు మ్యాపింగ్ పూర్తి చేయాలని, బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ పారాలు పంపిణీ చేసి సేకరించాలని తెలిపారు. సవరణ ప్రక్రియను పకడ్బందిగా నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Admin
వాస్తవ గమ్యం