Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో ప్రతిపాదిత ప్రాణహిత ప్రాజెక్టు ప్రాంతాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ప్రాణహిత నదికి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం పేరిట భారీగా ఖర్చు చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో చర్చలు జరిపి ప్రాజెక్టు నిర్మాణంపై ముందుకు వెళ్తామని చెప్పారు.మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, పాల్వాయి హరీష్ బాబు, కలెక్టర్ హరిత, ఎస్పీ నిఖిత పంత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam