వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : బస్సు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే లక్ష్యంతో మంత్రి హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ను సందర్శించి ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బస్టాండ్లోని సౌకర్యాలు, పరిశుభ్రత, తాగునీరు, ప్రయాణికులకు అందుతున్న సేవలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను విన్న మంత్రి, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన రవాణా సేవలు అందించడంలో ఆర్టీసీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది మరియు ప్రయాణికులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం