వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ గురువారం జిల్లాలో పర్యటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.తిర్యాని మండలంలోని సుంగాపూర్ గ్రామంలో రూ.3.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శాటిలైట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ గోడం నగేష్, పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం సుంగాపూర్లో రూ.3.25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనం నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణంలో నాసిరకం ఇసుక వాడుతున్నట్లు గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. వెంటనే నాసిరకం ఇసుకను తొలగించి నాణ్యమైన ఇసుకతోనే నిర్మాణ పనులు చేపట్టాలని సంబంధిత ఏఈ కి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం వృథా కాకుండా ప్రతి నిర్మాణం నాణ్యతతో పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కోటినాక విజయకుమార్, జిల్లా ఎన్నికల కన్వీనర్ నాగేశ్వరరావు, జిల్లా నాయకుడు కేసరి ఆంజనేయులు గౌడ్, బీజేపీ తిర్యాని మండల అధ్యక్షుడు సారా రమేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గాయంగి తిరుపతి, నాయకులు రంగు అరుణ్ కుమార్, శంకర్ గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం