Tuesday, 28 July 2026 03:08:36 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

అభివృద్ధి పనులపై ఎంపీ గోడం నగేష్ తనిఖీ..

నాసిరకం ఇసుక వాడకంపై ఆగ్రహం

Date : 09 July 2026 06:22 PM Views : 215

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ గురువారం జిల్లాలో పర్యటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.తిర్యాని మండలంలోని సుంగాపూర్ గ్రామంలో రూ.3.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శాటిలైట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ గోడం నగేష్, పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం సుంగాపూర్‌లో రూ.3.25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల భవనం నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణంలో నాసిరకం ఇసుక వాడుతున్నట్లు గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. వెంటనే నాసిరకం ఇసుకను తొలగించి నాణ్యమైన ఇసుకతోనే నిర్మాణ పనులు చేపట్టాలని సంబంధిత ఏఈ కి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం వృథా కాకుండా ప్రతి నిర్మాణం నాణ్యతతో పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కోటినాక విజయకుమార్, జిల్లా ఎన్నికల కన్వీనర్ నాగేశ్వరరావు, జిల్లా నాయకుడు కేసరి ఆంజనేయులు గౌడ్, బీజేపీ తిర్యాని మండల అధ్యక్షుడు సారా రమేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గాయంగి తిరుపతి, నాయకులు రంగు అరుణ్ కుమార్, శంకర్ గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :