వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, బయోమెట్రిక్ హాజరు వివరాలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులను కలిసి వైద్య సేవలు, ఆహార సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మారుమూల గిరిజన గ్రామాల నుండి వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఆదేశించారు.డిశ్చార్జ్ రిజిస్టర్ను పరిశీలించిన అనంతరం ఆసుపత్రి బయట రహదారిపై మురుగు కాలువల్లో చెత్తను వెంటనే తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య, ఆసుపత్రి పర్యవేక్షకులు ప్రవీణ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం