Friday, 31 July 2026 03:26:22 AM
# *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన

హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 29 July 2026 07:54 PM Views : 7

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ, నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి చర్యలను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.బుధవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేంద్ర రాథోడ్, ఎయిడ్స్ కోఆర్డినేటర్ నీలిమతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవి/ఎయిడ్స్ నియంత్రణ చర్యలను మరింత విస్తరించి, స్క్రీనింగ్ సేవలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. బహుళ రంగాల కార్యాచరణ వ్యూహం లక్ష్యాలను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.చికిత్స పొందని హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించడంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో స్వీయ ప్రమాద అంచనా క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసి స్వచ్ఛంద హెచ్ఐవి పరీక్షలను ప్రోత్సహించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ కార్మికులు, అధిక ప్రమాదం ఉన్న కార్మిక వర్గాల కోసం ప్రత్యేక ఆరోగ్య, హెచ్ఐవి స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. హెచ్ఐవి బాధితులకు సామాజిక సంరక్షణ, మద్దతు, భద్రత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులైన లబ్ధిదారులు సంబంధిత ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేంద్ర రాథోడ్ జిల్లాలో హెచ్ఐవి నియంత్రణ చర్యల పురోగతిని వివరించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు సేవలు మరింత చేరువయ్యేలా చెన్నూర్‌లో నూతన ఐసీటీసీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఐసీటీసీ కౌన్సిలర్లు, లింక్ ఆర్ట్ సెంటర్ సిబ్బంది, హెచ్ఐవి పాజిటివ్ నెట్‌వర్క్ ప్రతినిధులు పాల్గొన్నారు

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: