వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మేడారం నయారా పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే బైక్పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తుండగా, మద్యం సేవించి వాహనం నడపడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ముగ్గురు యువకులు రోడ్డుపై పడిపోగా, ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Reporter
వాస్తవ గమ్యం