Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఎస్ఐ కమలాకర్ పాల్గొని రోడ్డు భద్రత, మహిళల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వ్యక్తిగత భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. మహిళలు సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు. అనంతరం గ్రామసభకు హాజరైన ఎస్ఐ కమలాకర్ను సర్పంచ్ డోంగ్రి సంతోష్ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam