Sunday, 13 September 2026 07:53:57 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

భారతీయ వైద్య విధానం ప్రపంచానికి ఆదర్శం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 10 April 2026 04:49 PM Views : 91

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భారతీయ వైద్య విధానం ప్రపంచానికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత, ప్రోగ్రాం అధికారులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచానికి భారతీయ వైద్య విధానం ఆదర్శంగా నిలిచిందని, ఎన్నో రకాల వైద్య పద్ధతుల ద్వారా వ్యాధులను నయం చేసే విధానాలను అవలంబించడం జరుగుతుందని తెలిపారు. భారతీయ వైద్య వ్యవస్థలో హోమియో, ఆయుర్వేదం, యునాని, యోగ వంటి అనేక పద్ధతులలో వ్యాధులను నయం చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. కీళ్ల నొప్పులు, మధుమేహం, రక్త పటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను హోమియోపతి, న్యాచురోపతి, యోగ వంటి విధానాల ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆయుష్ వైద్యులు అందుబాటులో ఉన్నారని, ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అతి సాధారణ ఖర్చులతో ప్రకృతికి దగ్గరగా యోగ, ఫిజియోథెరపీ ద్వారా అందించే చికిత్సకు మంచి ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, గ్రామీణ స్థాయి నుండి పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, మన జిల్లాను పరిశుభ్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, వైద్యులు, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: