Tuesday, 28 July 2026 05:30:13 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

జంతు జనన నియంత్రణ ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి

Date : 28 June 2026 07:42 PM Views : 311

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య ఆదివారం విస్తృతంగా పరిశీలించారు. ఆండాళమ్మ కాలనీలోని జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి వీధి కుక్కల జనన నియంత్రణ శస్త్రచికిత్సలు, జంతు సంరక్షణ, పరిశుభ్రతను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణను పరిశీలించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని సూచించారు.కాసిపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న గ్రామపంచాయతీ భవనం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించి నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కూడా పరిశీలించి అర్హులందరికీ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.నెన్నెల, భీమారం మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామపంచాయతీలను సందర్శించి వైద్య సేవలు, అభివృద్ధి పనులు, ఓటరు జాబితా సవరణ, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ పనులు, వనమహోత్సవ ఏర్పాట్లను సమీక్షిస్తూ పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :