వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య ఆదివారం విస్తృతంగా పరిశీలించారు. ఆండాళమ్మ కాలనీలోని జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి వీధి కుక్కల జనన నియంత్రణ శస్త్రచికిత్సలు, జంతు సంరక్షణ, పరిశుభ్రతను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణను పరిశీలించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని సూచించారు.కాసిపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న గ్రామపంచాయతీ భవనం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించి నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కూడా పరిశీలించి అర్హులందరికీ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.నెన్నెల, భీమారం మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామపంచాయతీలను సందర్శించి వైద్య సేవలు, అభివృద్ధి పనులు, ఓటరు జాబితా సవరణ, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ పనులు, వనమహోత్సవ ఏర్పాట్లను సమీక్షిస్తూ పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Reporter
వాస్తవ గమ్యం