Sunday, 13 September 2026 06:42:37 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

జంతు జనన నియంత్రణ ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి

Date : 28 June 2026 07:42 PM Views : 339

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య ఆదివారం విస్తృతంగా పరిశీలించారు. ఆండాళమ్మ కాలనీలోని జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి వీధి కుక్కల జనన నియంత్రణ శస్త్రచికిత్సలు, జంతు సంరక్షణ, పరిశుభ్రతను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణను పరిశీలించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని సూచించారు.కాసిపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న గ్రామపంచాయతీ భవనం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించి నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కూడా పరిశీలించి అర్హులందరికీ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.నెన్నెల, భీమారం మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామపంచాయతీలను సందర్శించి వైద్య సేవలు, అభివృద్ధి పనులు, ఓటరు జాబితా సవరణ, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ పనులు, వనమహోత్సవ ఏర్పాట్లను సమీక్షిస్తూ పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :