వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కాసిపేట,మండలంలోని కాసిపేట-1 గనిపై మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో గని మేనేజర్ డి సతీష్, సేఫ్టీ ఆఫీసర్ నిఖిల్ అయ్యర్,డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్వర్లు, వెల్ఫేర్ ఆఫీసర్ జీసా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.వారితో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు మరియు అధికారులు పూలే ఆశయాలను కొనియాడారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, పిట్ సెక్రెటరీ మినుగు లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ సెక్రెటరీ వి. రాజేందర్,చౌడ లింగయ్య,సతీష్.బీసీ సంఘం కాసిపేట గని అధ్యక్షుడు పార్వతి సురేష్.టీబీజీక్స్,పిట్ సెక్రెటరీ బైరి శంకర్,అఫ్జల్. ఐన్టీయూసీ,ఏరియా నాయకులు బన్న లక్ష్మణ్ దాస్,ఎస్. కన్నయ్య,రాజన్న.సీఐటీయూ, నాయకులు శ్రీధర్. ఏస్సీ/ఏస్టీ సంఘం,కేంద్ర కమిటీ నాయకులు తిరుపతి, కృష్ణ. ఈ కార్యక్రమంలో వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ జంజీరాల రంజిత్ కుమార్,హెడ్ ఓవర్ మెన్ వొడ్నాల మహేష్, బియ్యాల రాజన్న, రవీందర్ మరియు ఇతర కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పూలే చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.
Admin
వాస్తవ గమ్యం