వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో క్వాలిటీ డిపార్ట్మెంట్కు చెందిన సి.వి. రమణారావు, డిప్యూటీ సూపరింటెండెంట్కు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ప్రదానం చేశారు.విధుల,నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యతాయుతమైన సేవలతో పాటు సంస్థ అభివృద్ధికి చేసిన విశేష కృషిని గుర్తించి ఈ అవార్డును అందజేశారు.ఈ సందర్భంగా అధికారులు, సహోద్యోగులు రమణారావును అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆయనకు లభించిన ఈ పురస్కారం క్వాలిటీ విభాగానికి గర్వకారణంగా, ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం