Vastava Gamyam - తెలంగాణ / నిర్మల్ : ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థికి మళ్లీ కో అప్షన్ సభ్యురాలిగా అవకాశం దక్కింది. నిర్మల్ పట్టణంలోని 24వ వార్డు నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మేడారం అపర్ణ ప్రదీప్, బీజేపీ అభ్యర్థి ఒడిసెల లక్ష్మీ చేతిలో ఓడిపోయారు. మూడు పర్యాయాలు కౌన్సిలర్గా సేవలందించిన ఆమెకు మరోసారి అదృష్టం కలిసొచ్చింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆశీస్సులతో శనివారం జరిగిన సమావేశంలో కోఆప్షన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఆమె మళ్లీ మున్సిపల్ రాజకీయాల్లో ప్రాధాన్యత సాధించారు.
Admin
Vastava Gamyam