Monday, 14 September 2026 10:56:02 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​మంత్రి వివేక్ చొరవతో 213 మంది సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు భద్రం

హర్షం వ్యక్తం చేసిన కార్మికులు

Date : 22 May 2026 03:20 PM Views : 897

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి ఏరియా సెక్యూరిటీ కార్యాలయంలో కాంట్రాక్ట్ గడువు ముగిసిందనే నెపంతో తొలగించిన 213 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఉద్యోగ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో తమకు తిరిగి ఉద్యోగాలు లభించనున్నాయని సెక్యూరిటీ గార్డులు ఆనందం వ్యక్తం చేశారు.దాదాపు రెండు నెలలుగా ఉద్యోగాలు లేక, జీఎం కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే తమ సమస్యను హైదరాబాద్ సచివాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల బాధలను ఓపికగా విన్న మంత్రి.తక్షణమే స్పందించి సింగరేణి సి.అండ్.ఎమ్.డి బుద్ధా ప్రకాష్‌తో మాట్లాడారు. మానవీయ కోణంలో ఆలోచించి కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. ​మంత్రి ఆదేశాలతో స్పందించిన యాజమాన్యం.మరో 5 రోజుల్లో నూతన టెండర్ పద్ధతి ద్వారా 213 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. తమ కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచి, ఉద్యోగాలు ఇప్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి సెక్యూరిటీ గార్డులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కుటుంబాలతో కలిసి మంత్రికి కృతజ్ఞత సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి, నాయకులు జావీద్, ఈసక్, మరియు సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: