Wednesday, 29 July 2026 09:06:15 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

​మంత్రి వివేక్ చొరవతో 213 మంది సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు భద్రం

హర్షం వ్యక్తం చేసిన కార్మికులు

Date : 22 May 2026 03:20 PM Views : 834

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి ఏరియా సెక్యూరిటీ కార్యాలయంలో కాంట్రాక్ట్ గడువు ముగిసిందనే నెపంతో తొలగించిన 213 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఉద్యోగ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో తమకు తిరిగి ఉద్యోగాలు లభించనున్నాయని సెక్యూరిటీ గార్డులు ఆనందం వ్యక్తం చేశారు.దాదాపు రెండు నెలలుగా ఉద్యోగాలు లేక, జీఎం కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే తమ సమస్యను హైదరాబాద్ సచివాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల బాధలను ఓపికగా విన్న మంత్రి.తక్షణమే స్పందించి సింగరేణి సి.అండ్.ఎమ్.డి బుద్ధా ప్రకాష్‌తో మాట్లాడారు. మానవీయ కోణంలో ఆలోచించి కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. ​మంత్రి ఆదేశాలతో స్పందించిన యాజమాన్యం.మరో 5 రోజుల్లో నూతన టెండర్ పద్ధతి ద్వారా 213 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. తమ కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచి, ఉద్యోగాలు ఇప్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి సెక్యూరిటీ గార్డులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కుటుంబాలతో కలిసి మంత్రికి కృతజ్ఞత సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి, నాయకులు జావీద్, ఈసక్, మరియు సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: