Saturday, 13 June 2026 09:40:48 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

​మంత్రి వివేక్ చొరవతో 213 మంది సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు భద్రం

హర్షం వ్యక్తం చేసిన కార్మికులు

Date : 22 May 2026 03:20 PM Views : 757

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి ఏరియా సెక్యూరిటీ కార్యాలయంలో కాంట్రాక్ట్ గడువు ముగిసిందనే నెపంతో తొలగించిన 213 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఉద్యోగ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో తమకు తిరిగి ఉద్యోగాలు లభించనున్నాయని సెక్యూరిటీ గార్డులు ఆనందం వ్యక్తం చేశారు.దాదాపు రెండు నెలలుగా ఉద్యోగాలు లేక, జీఎం కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే తమ సమస్యను హైదరాబాద్ సచివాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల బాధలను ఓపికగా విన్న మంత్రి.తక్షణమే స్పందించి సింగరేణి సి.అండ్.ఎమ్.డి బుద్ధా ప్రకాష్‌తో మాట్లాడారు. మానవీయ కోణంలో ఆలోచించి కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. ​మంత్రి ఆదేశాలతో స్పందించిన యాజమాన్యం.మరో 5 రోజుల్లో నూతన టెండర్ పద్ధతి ద్వారా 213 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. తమ కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచి, ఉద్యోగాలు ఇప్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి సెక్యూరిటీ గార్డులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కుటుంబాలతో కలిసి మంత్రికి కృతజ్ఞత సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి, నాయకులు జావీద్, ఈసక్, మరియు సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :