Tuesday, 28 July 2026 03:26:57 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు కలెక్టర్ కుమార్‌ దీపక్ ఆదేశం

Date : 11 May 2026 08:51 PM Views : 557

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జైపూర్ మండలంలోని టేకుమట్ల, రామారావుపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.కేంద్రాల సందర్శన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు ధాన్యం సేకరణను వేగవంతం చేయడంతో పాటు, రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు జరిగేలా చూడాలి. ​సమస్యల పరిష్కారం: కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత గానీ, లారీల రాకపోకల సమస్య గానీ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని ఆదేశించారు.ఈసారి రైతులు తమ ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా నేరుగా తెచ్చుకునే వెసులుబాటు కల్పించినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 12 రైస్ మిల్లుల ద్వారా మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.అనంతరం రామారావుపేట గ్రామంలో కొనసాగుతున్న ఇండ్ల గణన (సర్వే) ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ సర్వే చాలా కీలకం. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలను పక్కాగా, పారదర్శకంగా నమోదు చేయాలి" అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వనజారెడ్డి మరియు ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :