Monday, 14 September 2026 11:04:09 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు కలెక్టర్ కుమార్‌ దీపక్ ఆదేశం

Date : 11 May 2026 08:51 PM Views : 602

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జైపూర్ మండలంలోని టేకుమట్ల, రామారావుపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.కేంద్రాల సందర్శన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు ధాన్యం సేకరణను వేగవంతం చేయడంతో పాటు, రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు జరిగేలా చూడాలి. ​సమస్యల పరిష్కారం: కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత గానీ, లారీల రాకపోకల సమస్య గానీ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని ఆదేశించారు.ఈసారి రైతులు తమ ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా నేరుగా తెచ్చుకునే వెసులుబాటు కల్పించినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 12 రైస్ మిల్లుల ద్వారా మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.అనంతరం రామారావుపేట గ్రామంలో కొనసాగుతున్న ఇండ్ల గణన (సర్వే) ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ సర్వే చాలా కీలకం. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలను పక్కాగా, పారదర్శకంగా నమోదు చేయాలి" అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వనజారెడ్డి మరియు ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: