వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జైపూర్ మండలంలోని టేకుమట్ల, రామారావుపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.కేంద్రాల సందర్శన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు ధాన్యం సేకరణను వేగవంతం చేయడంతో పాటు, రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు జరిగేలా చూడాలి. సమస్యల పరిష్కారం: కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత గానీ, లారీల రాకపోకల సమస్య గానీ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని ఆదేశించారు.ఈసారి రైతులు తమ ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా నేరుగా తెచ్చుకునే వెసులుబాటు కల్పించినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 12 రైస్ మిల్లుల ద్వారా మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.అనంతరం రామారావుపేట గ్రామంలో కొనసాగుతున్న ఇండ్ల గణన (సర్వే) ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ సర్వే చాలా కీలకం. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలను పక్కాగా, పారదర్శకంగా నమోదు చేయాలి" అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వనజారెడ్డి మరియు ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం