వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత ఆరు రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాజువే రాళ్లవాగు వద్ద ప్రధాన పైప్లైన్ కొట్టుకుపోవడంతో మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొత్త పైప్లైన్ ఏర్పాటు పనుల కారణంగా కూడా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు వరుసగా తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తుండగా, పాలకవర్గం నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Reporter
వాస్తవ గమ్యం