Tuesday, 28 July 2026 08:04:49 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

ఎస్సీ ఎస్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

Date : 17 July 2026 07:29 PM Views : 28

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్‌టీ) సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. శుక్రవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు, కమిషన్ సభ్యులు, ఇతర అధికారులతో కలిసి సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం, గ్రామాల్లో మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఎస్‌సీ, ఎస్‌టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను పకడ్బందీగా అమలు చేసి వారి సంక్షేమం కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో 56,969 మంది ఎస్‌టీలు, 1,99,493 మంది ఎస్‌సీలు ఉన్నారని పేర్కొంటూ, అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు, పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం, బ్యాంకు లింకేజీ రుణాలు, గ్రామీణ మౌలిక వసతుల కల్పన, మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.అట్రాసిటీ కేసుల త్వరితగతిన విచారణ, బాధితులకు సకాలంలో పరిహారం, భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ప్రత్యేక ఎస్‌సీ, ఎస్‌టీ న్యాయస్థానం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్‌సీ, ఎస్‌టీలకు ప్రాధాన్యం కల్పించాలని, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి సకాలంలో వేతనాలు, పీఎఫ్, బీమా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఎస్‌సీ, ఎస్‌టీల అభివృద్ధి, సంక్షేమానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, పౌరసరఫరాల కమిటీ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :